శ్రీ వేదాంత భజన మందిరంలో అంగరంగ వైభవంగా ధనుర్మాస వేడుకలు
శ్రీ వేదాంత భజన మందిరంలో అంగరంగ వైభవంగా ధనుర్మాస వేడుకలు
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో ఉన్న శ్రీ వేదాంత భజన మందిరంలో ధనుర్మాస వేడుకలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పాశుపరాలు పట్టించి ధనుర్మాస ప్రత్యేక భజనలు నిర్వహించారు.
మందిర ప్రధానార్చకులు ధరూరి సింగరాచార్యులు, ధరూరి రాఘవాచార్యులు ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ధనుర్మాస వేడుకల్లో భాగంగా స్వామివారికి వెన్న నివేదన కార్యక్రమం భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మందిరానికి విచ్చేసిన భక్తులందరికీ ఉచితంగా వెన్న ప్రసాదాన్ని అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భజనలు, పూజా కార్యక్రమాలతో మందిరం భక్తిశోభతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్, కోశాధికారి భక్తులు, గోదాదేవి, ప్రేమలత, హైమావతి, స్వాతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ధనుర్మాస వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయని నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి