Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:24 PM

శోభయామానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం

శోభయామానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం

శోభయామానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం
January 23, 2026 09:11 PM 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్వామి ఊరేగింపును ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేషo

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం స్వామివారి నగరోత్సవం భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని రామాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి వేదోక్త పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా స్వామివారి నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి హారతులు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.

ఈ నగరోత్సవ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఆలయ ఈవో, నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, నార్కెట్‌పల్లి మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య, చెర్వుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భక్తుల జయజయధ్వానాల నడుమ జరిగిన ఈ నగరోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News