శోభయామానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం
శోభయామానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం
Komidala Mahender reddy
స్వామి ఊరేగింపును ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేషo
నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం స్వామివారి నగరోత్సవం భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని రామాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి వేదోక్త పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా స్వామివారి నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి హారతులు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.
ఈ నగరోత్సవ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఆలయ ఈవో, నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, నార్కెట్పల్లి మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య, చెర్వుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తుల జయజయధ్వానాల నడుమ జరిగిన ఈ నగరోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి