PRINT TIME: May 26, 2026 08:58 PM
శంకరంపేట్ లో శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న:ఖేఢ్ ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు
శంకరంపేట్ లో శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న:ఖేఢ్ ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు
March 27, 2026 12:39 PM
55 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేట్ మండల కేంద్రంలోని శ్రీ సీతరాముల ఆలయంలో శ్రీ రామనవమి సందర్భంగా ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు శ్రీ సీతారాముల స్వామివారిని దర్శించుకుని,పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి,భక్తి భావంతో నిండిపోయింది.ఈ కార్యక్రమంలో శంకరంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,సర్పంచులు, ప్రజాప్రతినిధులు,పట్టణ ప్రముఖులు,యువత మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో సాగాయి. పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ,కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి