శిథిలావస్థలో గ్రామ సచివాలయం – పెచ్చులుగా ఊడిపడుతున్న పైకప్పు
శిథిలావస్థలో గ్రామ సచివాలయం – పెచ్చులుగా ఊడిపడుతున్న పైకప్పు
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల పరిధిలోని కేతగానిచెరువు గ్రామ సచివాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వ సేవలు అందించే కీలక కేంద్రంగా ఉన్న ఈ భవనం నిర్లక్ష్యానికి గురై ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా సచివాలయం పైకప్పు నుండి పెచ్చులు ఊడిపడుతున్నాయి. గోడలు చిట్లిపోవడం, పైకప్పు బలహీనపడటం వల్ల ఎప్పుడైనా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ వివిధ పనుల కోసం సచివాలయానికి వచ్చే గ్రామస్తులు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని వారు చెబుతున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే భవనాన్ని మరమ్మతు చేయించి లేదా కొత్త భవనం నిర్మించి ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చూడాలని గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు త్వరితగతిన స్పందించాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి