PRINT TIME: April 11, 2026 09:23 AM
షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..
షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..
April 11, 2026 07:31 AM
8 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish HS
పెంతెనకొస్తల్ డయసిస్ ఇండియా ద్వారా బిషప్ గా నియామకం
కోదాడ పట్టణంలో ఉన్న ఆర్ ఎస్ వి ఫంక్షన్ హాల్ నందు పాస్టర్ జోసఫ్ కు గాంధీనగర్ లో ఉన్న షెకిన ప్రార్థన మందిరం సంఘస్తులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ మరియు వైస్ చైర్మెన్ మల్లీశ్వరి మరియు స్థానిక కౌన్సిలర్లు పాల్గొని జోసఫ్ పాస్టర్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు.. అనంతరం వారు మాట్లాడుతూ... కోదాడ పట్టణంలో 30 సంవత్సరాల నుంచి షెకిన ప్రార్థన మందిరంలో దైవజనులుగా సేవలందిస్తున్న పాస్టర్ జోసఫ్ కు బిషఫ్ గా నియమితులు కావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలిపారు... ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ వార్డు కౌన్సిలర్లు మరియు వివిధ పార్టీల నాయకులు మరియు ఎలియా,గెజ్జమ్మ , ఇర్మియా, సంతోష్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి