శాస్త్రీయ ఆలోచనలతోనే ఉజ్వల భవిష్యత్తు....
శాస్త్రీయ ఆలోచనలతోనే ఉజ్వల భవిష్యత్తు....
Harish HS
రేపటి శాస్త్రవేత్తలు విద్యార్థులే..
ఎస్. వి. విద్యా సంస్థల చైర్మన్ ముత్తినేని సైదేశ్వరరావు..
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్ ఒక అద్భుతమైన వేదిక అని ఎస్వీ విద్యాసంస్థల చైర్మన్ ముత్తినేని సైదేశ్వరరావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథంతోనే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రిన్సిపాల్ పుల్లూరి వెంకట నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ప్రదర్శించిన నమూనాలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో అకాడమిక్ ఇంచార్జ్ గోవర్ధన్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు నాంచారయ్య,కన్నయ్య రాయుడు,రవీందర్ నాయక్, ఇంగ్లీష్ వెంకన్న,ఆంజనేయులు,దుర్గా ప్రసాద్ వెంకట్,వెంకట రెడ్డి,శాంత కుమారి, రాజేశ్వరి, జ్యోత్స్న సందీప్, కిరణ్మయి, కావ్య, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.....

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి