Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ మల మూత్ర ద్వారాలు ఏర్పాటుతో దూడకు జీవం పోసిన అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య

శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ మల మూత్ర ద్వారాలు ఏర్పాటుతో దూడకు జీవం పోసిన అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య

శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ మల మూత్ర ద్వారాలు ఏర్పాటుతో దూడకు జీవం పోసిన అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య
February 04, 2026 03:47 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ మల మూత్ర ద్వారాలు ఏర్పాటుతో దూడకు జీవం పోసిన అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య

ఆత్మకూరు ఎస్ మండలం నసీం పేట గ్రామానికి చెందిన గుండపునేని రవీందర్ రావు ఇంట్లో గేదె నిన్న దూడను పెట్టగా విచిత్రంగా పుట్టిన

దూడ కి మల , మూత్ర ద్వారాలు మరియు జననావయాలు లేకుండా పుట్టింది. అది ఆడ దూడో మగ దూడో కూడా తెలియకుండా రైతు ఆందోళనకు గురయ్యాడు. వైద్యం కోసం సూర్యాపేట ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ ని సంప్రదించగా , దూడను పరిశీలించి అత్యవసర శస్త్ర చికిత్సకై దూడను కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలకు పంపించారు.దూడ పొట్ట తెరిచిన తరువాత మల ద్వారం చివరివరకు ఏర్పాటు కాకుండా మధ్యలోనే ఉండిపోవడం తో దానిని అంతవరకు కత్తిరించి , అట్టి పేగుని పొట్ట లోపలి నుండి వెనుకకి లాగి మలద్వారం ఉండాల్సిన ప్రాంతం లో కృత్రిమ ద్వారం ఏర్పాటు చేసి కత్తిరించిన పేగుని కృత్రిమ మలద్వారం ద్వారా బైటకు అతికించి కుట్లు వేసి శాశ్వత మలద్వారం ఏర్పాటు చేయడం జరిగింది.

మూత్రాశయం నుండి మూత్ర నాళం తయారు కాక మూత్రం ముత్యరాశంలోనే నిండి ఉండగా చిన్న రంధ్రం ద్వారా మూత్రాన్ని తొలగించి మూత్రాశయం లోనికి మనుష్యులలో వాడే మూత్ర నాళికా గొట్టాన్ని అమర్చి తిరిగి పొట్టకు కుట్లు వేసి అతికించి మూత్రం సాఫీగా నడవడానికి కృత్రిమ ద్వారం ఏర్పాటు తో దూడ పొట్ట నొప్పి తగ్గి ఉపశమనం పొందేలా విజయవంతంగా శస్త్ర చికిత్స ముగించారు .

శస్త్రచికిత్స లో చిలుకూరు మండల పశువైద్యాధికారి డా. కొండా వీరారెడ్డి, కాపుగల్లు పశువైద్యాధికారి డా. సిరిపురపు సురేంద్ర, సిబ్బంది రాజు, చంద్రకళ, సాగర్ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News