శ్రీరామనవమి వేడుకలకు శుభారంభం శ్రీ సీతారాముల కళ్యాణానికి లగ్నపత్రిక రచన
శ్రీరామనవమి వేడుకలకు శుభారంభం శ్రీ సీతారాముల కళ్యాణానికి లగ్నపత్రిక రచన
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు లింగోజిగూడెంలో ఉన్న శ్రీశ్రీశ్రీ శివమహదేవ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆలయ కమిటీ చైర్మన్ బండమీది ఎల్లయ్య, ధర్మకర్తలు బోసి అన్నపూర్ణ, బాతరాజు యాదయ్య, మాందోరి నరేష్, చెరుకు సాయిరాం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన లగ్నపత్రికను పండితులు శాస్త్రోక్తంగా రచించారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, పండితులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే కళ్యాణోత్సవం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా భారీగా భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పర్నె శివారెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, మాజీ సర్పంచ్ ఊదరి నరసింహ, నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తొర్పునూరి శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బండమీది వెంకటేష్, మాజీ అధ్యక్షులు ఎర్రగోని లింగస్వామి యాదవ్, బాతరాజు అంజయ్య, బండారి ప్రవీణ్, ఎర్రగోని కిష్టయ్య, మాందోరి సురేష్, ఊదరి క్రాంతి, ఎర్రగోని నవీన్ యాదవ్, ఊదరి అంజయ్య, బాతరాజు గిరి, బాతరాజు స్వామి, బంగారు అంజి, బోసి బాబు, అనిల్, నరేష్, పిల్ల వెంకటేష్, ముత్యాల మహేష్, కిరణ్, అక్బర్, శివ, లింగస్వామి, మహేష్, రాజు, తీగల రాజు, శివ, వేణు, గణేష్, సిద్దు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి