శ్రీరామనవమి ఉత్సవాలకు ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆహ్వానం
శ్రీరామనవమి ఉత్సవాలకు ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆహ్వానం
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలకు నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం మున్సిపల్ ప్రముఖులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు , స్థానిక శివాలయం నూతనంగా నిర్మించిన ఆలయ గోపురాన్ని ప్రారంభించాల్సిందిగా ఎమ్మెల్యే కోరగా, వారు సానుకూలంగా స్పందించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం తన అంగీకారాన్ని తెలియజేశారు. చిట్యాల గ్రామ ప్రజానీకం అందరూ అత్యధిక సంఖ్యలో హాజరై, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పునీతులు కావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శివాలయ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు పందిరి రమేష్ , దౌలతాబాద్ వాసు దేవ శర్మ , పందిరి శ్రీనివాసులు, జడల చిన్న మల్లయ్య యాదవ్, పాటి మాధవరెడ్డి, మారగొని ఆంజనేయులు, వనమా వెంకటేశ్వర్లు, బూర్గు కృష్ణయ్య, మెట్టు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి