శ్రీరామనవమి సందర్బంగా ఎమ్మెల్యే వేముల వీరేశం భక్తి పూర్వక పర్యటన
శ్రీరామనవమి సందర్బంగా ఎమ్మెల్యే వేముల వీరేశం భక్తి పూర్వక పర్యటన
Komidala Mahender reddy
నకిరేకల్ నియోజకవర్గంలో ఆలయాల సందర్శన – ప్రజల శ్రేయస్సుకోసం ప్రత్యేక ప్రార్థనలు
నకిరేకల్ నియోజకవర్గంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం భక్తిశ్రద్ధలతో పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మొదటగా చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించిన ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. అనంతరం పట్టణంలోని శివాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.
తదుపరి నార్కెట్పల్లి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు.
పర్వదినం సందర్భంగా ప్రజలతో కలిసి భక్తి భావనలో పాల్గొనడం ఆనందంగా ఉందని, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి