Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్యావరణంపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన జ్యోతుల మహోత్సవంతో మార్మోగిన ఈదులబలాపురం – రామనామంతో భక్తుల ప్రదక్షిణ TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 05:43 PM

శ్రీరామనవమి సందర్బంగా ఎమ్మెల్యే వేముల వీరేశం భక్తి పూర్వక పర్యటన

శ్రీరామనవమి సందర్బంగా ఎమ్మెల్యే వేముల వీరేశం భక్తి పూర్వక పర్యటన

శ్రీరామనవమి సందర్బంగా ఎమ్మెల్యే వేముల వీరేశం భక్తి పూర్వక పర్యటన
March 27, 2026 03:35 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలో ఆలయాల సందర్శన – ప్రజల శ్రేయస్సుకోసం ప్రత్యేక ప్రార్థనలు

నకిరేకల్ నియోజకవర్గంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం భక్తిశ్రద్ధలతో పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మొదటగా చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించిన ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. అనంతరం పట్టణంలోని శివాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.

తదుపరి నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు.

పర్వదినం సందర్భంగా ప్రజలతో కలిసి భక్తి భావనలో పాల్గొనడం ఆనందంగా ఉందని, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News