శ్రీరామ నవమి వేళ నల్లపోచమ్మ ఆలయంలో ఘన పూజలు
శ్రీరామ నవమి వేళ నల్లపోచమ్మ ఆలయంలో ఘన పూజలు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అర్చకులు సిద్దు స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అనంతరం పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు ఘనంగా జరిపారు. పూజల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలను మొక్కుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సిద్దు స్వామి మాట్లాడుతూ, మంజీర నది ఒడ్డున ఉన్న ఈ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందినదని, మారుమూల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. అమ్మవారికి చేసిన ప్రార్థనలు నెరవేరుతాయని భక్తుల్లో గాఢ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఆలయానికి మరింత వైభవాన్ని తీసుకువచ్చి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి