Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:36 AM

శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్

శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్

శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
01-02-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం గోపాలాయపల్లి

గోపాలాయపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శాస్త్రోక్త విధానాలతో నిర్వహించిన ఈ కళ్యాణానికి పరిసర గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

విద్యుద్దీపాల అలంకరణలు, పుష్పాలంకరణలతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, కళ్యాణ ఘట్ట సమయంలో భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సతీ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎస్పీ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు సజావుగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పి, భక్తుల్లో అపూర్వ ఆనందాన్ని నింపింది.


Sthanikam

శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్

Article Image

నల్లగొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం గోపాలాయపల్లి

గోపాలాయపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శాస్త్రోక్త విధానాలతో నిర్వహించిన ఈ కళ్యాణానికి పరిసర గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

విద్యుద్దీపాల అలంకరణలు, పుష్పాలంకరణలతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, కళ్యాణ ఘట్ట సమయంలో భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సతీ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎస్పీ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు సజావుగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పి, భక్తుల్లో అపూర్వ ఆనందాన్ని నింపింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News