శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా, నార్కట్పల్లి మండలం గోపాలాయపల్లి
గోపాలాయపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శాస్త్రోక్త విధానాలతో నిర్వహించిన ఈ కళ్యాణానికి పరిసర గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
విద్యుద్దీపాల అలంకరణలు, పుష్పాలంకరణలతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, కళ్యాణ ఘట్ట సమయంలో భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సతీ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎస్పీ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు సజావుగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పి, భక్తుల్లో అపూర్వ ఆనందాన్ని నింపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి