Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:07 PM

శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీలో రూ.15.50 లక్షలతో పార్క్ అభివృద్ధి

శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీలో రూ.15.50 లక్షలతో పార్క్ అభివృద్ధి

శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీలో రూ.15.50 లక్షలతో పార్క్ అభివృద్ధి
February 08, 2026 04:24 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీలో రూ.15.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులకు విశ్రాంతి, వినోదం, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే విధంగా పార్కును సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కాలనీ అభివృద్ధిలో భాగంగా పార్క్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించగా, పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. త్వరలోనే పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, మాజీ అధ్యక్షుడు కృష్ణ, ఉపాధ్యక్షుడు రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ చారి, కోశాధికారి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జైపాల్ నాయక్, కార్యవర్గ సభ్యులు లక్ష్మయ్య, రమేష్ పాల్గొన్నారు. అలాగే పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు మహేష్, డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ కుమార్, ఎస్సీ మోర్చా కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు హాజరయ్యారు.కాలనీలో పార్క్ అభివృద్ధితో ప్రజలకు మేలు జరుగుతుందని, కార్పొరేటర్ కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News