Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:39 AM

శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీలో రూ.15.50 లక్షలతో పార్క్ అభివృద్ధి

శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీలో రూ.15.50 లక్షలతో పార్క్ అభివృద్ధి

శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీలో రూ.15.50 లక్షలతో పార్క్ అభివృద్ధి
February 08, 2026 04:24 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీలో రూ.15.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులకు విశ్రాంతి, వినోదం, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే విధంగా పార్కును సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కాలనీ అభివృద్ధిలో భాగంగా పార్క్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించగా, పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. త్వరలోనే పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, మాజీ అధ్యక్షుడు కృష్ణ, ఉపాధ్యక్షుడు రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ చారి, కోశాధికారి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జైపాల్ నాయక్, కార్యవర్గ సభ్యులు లక్ష్మయ్య, రమేష్ పాల్గొన్నారు. అలాగే పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు మహేష్, డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ కుమార్, ఎస్సీ మోర్చా కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు హాజరయ్యారు.కాలనీలో పార్క్ అభివృద్ధితో ప్రజలకు మేలు జరుగుతుందని, కార్పొరేటర్ కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News