శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Vikram
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
సూర్యాపేట మండలం చివ్వెంల – ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూజ్య మంత్రస్వరూప్ దాస్ జీ స్వామీజీ, పాఠశాల ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి భావనలతో ముందుకు సాగుతూ ప్రతి భారతీయుడు దేశ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం వంటి విలువలను కాపాడుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి