Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:56 AM

శ్రీ రాముని జయంతిని స్మరిస్తూ ముక్టపూర్ గ్రామంలో ఘన నగర సంకీర్తన

శ్రీ రాముని జయంతిని స్మరిస్తూ ముక్టపూర్ గ్రామంలో ఘన నగర సంకీర్తన

శ్రీ రాముని జయంతిని స్మరిస్తూ ముక్టపూర్ గ్రామంలో ఘన నగర సంకీర్తన
January 22, 2026 08:48 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన పవిత్ర దినాన్ని స్మరిస్తూ,గురువారం నాగల్ గిద్ద మండలం ముక్టపూర్ గ్రామం లో జనవరి 22న శ్రీ రామ నగర సంకీర్తన ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో ప్రముఖ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భక్తులతో కలసి రామనామ స్మరణలో పాల్గొన్నారు.గురువారం సాయంత్రం 8.00 గంటల నుండి ముక్టపూర్ గ్రామంలోని దేవాలయాల నుండి, అలాగే గ్రామంలోని భక్తులు హనుమాన్ దేవాలయాలు మరియు ఇతర ఆలయాల కార్యవర్గాల ఆధ్వర్యంలో నగర సంకీర్తన ప్రారంభమైంది. ప్రతి ఆలయం నుంచి బయలుదేరిన భక్తులు రామ భజనలు ఆలపిస్తూ, కోలాటతో ఊరేగింపు ఘనంగా సాగింది. కార్యక్రమం చివర గ్రామం చావుడి ప్రధాన రోడ్ వద్దకు చేరి, శ్రీ రాముని జెండా సమర్పణతో రామజపం ప్రార్థన ముగించబడింది.పట్లోల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “శ్రీ రాముని ఆదర్శాలు ప్రతి ఒక్కరి జీవితంలో నిలవాలి. ఇలాంటి నగర సంకీర్తనలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి” అని పేర్కొన్నారు. భక్తులు స్వీట్ పంపిణీ, భజనల ఆలాపన వంటి సేవల్లో స్వచ్ఛందంగా పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. పని దినమైనప్పటికీ పెద్ద సంఖ్యలో యువకులు, ప్రజలు హాజరైనందున ఆ రోజు గ్రామ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మురిసిపోయాయి. యువత, రామ భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం విశేషం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News