Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:16 PM

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి...

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి...

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి...
March 27, 2026 08:01 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కళ్యాణం... కమనీయం.... రమణీయం...

గోపిరెడ్డి నగర్ లో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం....

శ్రీ సీతారాముల కళ్యాణం దర్శన భాగ్యం కల్పించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అభినందనీయులు... మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు...

శ్రీ సీతారాముల ఆశీస్సులతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్ లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవంలో వారి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో శాంతి సామరస్యాలు పెంపొందుతాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి ధన్యులం అయ్యాం అన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ దర్శన భాగ్యం కల్పించిన గోపి రెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు. పట్టణ ప్రజలకు శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, 6వ కౌన్సిలర్ నాగేంద్రమ్మ 14వ వార్డు కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు 19 వ వార్డు కౌన్సిలర్ కొల్ల కోటి రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ గుండపు నేని పద్మ,గోపిరెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News