Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

శ్రీ సీతారామాలయంలో ఉగాది వేడుకలు

శ్రీ సీతారామాలయంలో ఉగాది వేడుకలు

 శ్రీ సీతారామాలయంలో ఉగాది వేడుకలు
March 19, 2026 07:57 PM 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వేద పండితుల పంచాంగ ప్రవచనం – శుభసూచనలు

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని భవాని నగర్‌లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమంతో పాటు భక్తులకు ఉగాది పచ్చడి, భక్షాల పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన చౌటుప్పల్ పురపాలక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని, వారి చేతుల మీదుగా భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.వేద పండితులు పెద్ది సుధాకర్ శర్మ, పెద్ది కిషోర్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించి, ఈ సంవత్సరానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు, దేశ రాష్ట్ర పరిస్థితులను వివరించారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశముందని, రైతులు అభివృద్ధి సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, ధర్మకర్తలు కామిశెట్టి చంద్రశేఖర్, గుర్రం వెంకటేష్, వర్కల వెన్నెల రవి గౌడ్, తూర్పాటి నరసింహ, మున్సిపల్ కౌన్సిలర్లు బత్తుల వాణి విప్లవ్ గౌడ్, దేప రమ్య రాజు, ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బత్తుల జయలక్ష్మి దాసు గౌడ్, మంచి కంటికి భాస్కర్ గుప్తా, బొడిగే బాలకృష్ణ గౌడ్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, ఉడుగు మల్లేష్ గౌడ్, చింతల తిరుమలరెడ్డి, బొబ్బిళ్ళ రాజేందర్, చెరుకు లింగస్వామి గౌడ్, గోశిక రవి, గంగరాములు, చెవగొని వెంకటేష్ గౌడ్, జక్కర్తి శేఖర్, పెద్దగోని రమేష్ గౌడ్, ముద్దం సత్తయ్య గౌడ్, కర్నాటి శ్యామ్, ఉప్పల కృష్ణ గుప్తా, సంగమేశ్వర్, రాజేష్ గౌడ్, ఒరగంటి మహేందర్ గౌడ్, మునుకుంట్ల జంగయ్య గౌడ్, వీరమల్ల యాదయ్య గౌడ్, ఆంజనేయ చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News