Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 11:58 AM

శ్రీ అందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు

శ్రీ అందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు

శ్రీ అందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు
February 24, 2026 10:24 AM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

ఏడు నెలల్లో రూ.26.73 లక్షల ఆదాయం

చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ లెక్కింపును సోమవారం నిర్వహించారు. ఏడు నెలల 20 రోజుల వ్యవధికి గాను మొత్తం రూ.26,73,578 ఆదాయం వచ్చినట్లు దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఎస్. మోహన్ బాబు తెలిపారు.హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో జరిగింది.భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా భారీగా వచ్చిన హుండీ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ సహాయ కమిషనర్ కె. భాస్కర్, బ్యాంకు క్యాషియర్ జి. సుశాంత్, పోలీసు సిబ్బంది, శ్రీవారి సేవా సమితి సభ్యులు, అర్చకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News