Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:03 AM

శ్రవణా నక్షత్రం సందర్భంగా స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ...

శ్రవణా నక్షత్రం సందర్భంగా స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ...

శ్రవణా నక్షత్రం సందర్భంగా స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ...
February 17, 2026 01:47 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు.

తెలంగాణ ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దేవస్థానంలో సోమవారం రోజు శ్రవణా నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటల 30 నిమిషాలకు స్వర్ణగిరి క్షేత్రంలోని స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు,చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణల ఆదేశాల మేరకు గిరి ప్రదక్షణ యొక్క విశిష్టతను భక్తులకు వివరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి గోవింద నామాలను స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించు కుని దివ్యానుభూతిని పొందారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచి నీరు,మజ్జిగను పంపిణీ చేశారు.అలాగే వచ్చేది వేసవికాలం దృశ భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లను ఏర్పాటు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News