Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారుల భద్రతకు ముందడుగు – ప్రత్యేక బాల ఆరోగ్య పరీక్షలకు శ్రీకారం బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 10:29 PM

శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్

శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్

శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్
May 01, 2026 08:50 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,: మే డే సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యాదగిరిగుట్ట తాపీ కార్మిక యూనియన్ అధ్యక్షుడు ఆకుల రవి యాదవ్‌కు ‘శ్రమశక్తి పురస్కారం’ అందజేశారు. ఈ పురస్కారాన్ని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర చైర్మన్ ప్రకాష్ గౌడ్, హన్మంతరావు చేతుల మీదగా ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆకుల రవి యాదవ్ మాట్లాడుతూ 2023లో మొదటి అవార్డు, 2026లో రెండోసారి శ్రమశక్తి పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమకు ఈ గౌరవం దక్కడానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు సుడుగు జీవన్ రెడ్డి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు శెట్టి గోపాల్, ఉపాధ్యక్షుడు పల్లెపాటి మాధవులు, ప్రధాన కార్యదర్శి కొనపాలక విఠల్, సహ కార్యదర్శి పబ్బాల చంద్రయ్య, కోశాధికారి దూశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News