శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్
శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్
Editor Desk
హైదరాబాద్,: మే డే సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యాదగిరిగుట్ట తాపీ కార్మిక యూనియన్ అధ్యక్షుడు ఆకుల రవి యాదవ్కు ‘శ్రమశక్తి పురస్కారం’ అందజేశారు. ఈ పురస్కారాన్ని ఐఎన్టీయూసీ రాష్ట్ర చైర్మన్ ప్రకాష్ గౌడ్, హన్మంతరావు చేతుల మీదగా ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆకుల రవి యాదవ్ మాట్లాడుతూ 2023లో మొదటి అవార్డు, 2026లో రెండోసారి శ్రమశక్తి పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమకు ఈ గౌరవం దక్కడానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు సుడుగు జీవన్ రెడ్డి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు శెట్టి గోపాల్, ఉపాధ్యక్షుడు పల్లెపాటి మాధవులు, ప్రధాన కార్యదర్శి కొనపాలక విఠల్, సహ కార్యదర్శి పబ్బాల చంద్రయ్య, కోశాధికారి దూశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి