Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:50 AM

శ్రమదానం, పోటీ పరీక్షలపై అవగాహన – ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

శ్రమదానం, పోటీ పరీక్షలపై అవగాహన – ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

శ్రమదానం, పోటీ పరీక్షలపై అవగాహన – ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం
January 04, 2026 08:09 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ స్థానికం ప్రతినిధి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పసుమాముల, కళానగర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా మూడో రోజు శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించారు. యూనిట్–1 వాలంటీర్లు పసుమాముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, యూనిట్–2 వాలంటీర్లు ప్రాథమిక పాఠశాలలో పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.

మధ్యాహ్నం అనంతరం కళాశాల లైబ్రేరియన్, ఈ–లైబ్రరీ తెలంగాణ ఫౌండర్ డా.ఏ.దుర్గాప్రసాద్ శిబిరాన్ని సందర్శించి యూపీఎస్సీ సివిల్స్, గ్రూప్–1, పీజీ ఎంట్రెన్స్, లాసెట్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షలపై అవగాహన కల్పించారు. డిగ్రీ అనంతరం విద్యార్థులు ఎలా సిద్ధం కావాలో, సిలబస్, మెటీరియల్, ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు, వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్ వినియోగంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.ఇ.యాదగిరి రెడ్డి, డా.ఎస్.శారదా దేవి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News