శ్రమదానం, పోటీ పరీక్షలపై అవగాహన – ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం
శ్రమదానం, పోటీ పరీక్షలపై అవగాహన – ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం
Editor Desk
హయత్నగర్ స్థానికం ప్రతినిధి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పసుమాముల, కళానగర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా మూడో రోజు శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించారు. యూనిట్–1 వాలంటీర్లు పసుమాముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, యూనిట్–2 వాలంటీర్లు ప్రాథమిక పాఠశాలలో పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.
మధ్యాహ్నం అనంతరం కళాశాల లైబ్రేరియన్, ఈ–లైబ్రరీ తెలంగాణ ఫౌండర్ డా.ఏ.దుర్గాప్రసాద్ శిబిరాన్ని సందర్శించి యూపీఎస్సీ సివిల్స్, గ్రూప్–1, పీజీ ఎంట్రెన్స్, లాసెట్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షలపై అవగాహన కల్పించారు. డిగ్రీ అనంతరం విద్యార్థులు ఎలా సిద్ధం కావాలో, సిలబస్, మెటీరియల్, ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు, వెబ్సైట్లు, మొబైల్ యాప్స్ వినియోగంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.ఇ.యాదగిరి రెడ్డి, డా.ఎస్.శారదా దేవి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి