శోభనాద్రిపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎటెల్లి పరమేశ్
శోభనాద్రిపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎటెల్లి పరమేశ్
Editor Desk
శోభనాద్రిపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎటెల్లి పరమేశ్ నియామకం
రామన్నపేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామశాఖ అధ్యక్షునిగా ఎటెల్లి పరమేశ్ ను నియమించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి వెల్లడించారు.
ఈ నియామకం నేటి నుంచే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాసమస్యలపై పోరాటంలో ఎటెల్లి పరమేశ్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పున్న జగన్మోహన్, మేడి రవిచంద్ర, పిట్ట వెంకట్ రెడ్డి, పిట్ట రామ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జామిరోద్దీన్, బత్తుల నవీన్, దేవేందర్ సాయి తదితరులు పాల్గొని నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి, పార్టీ విస్తరణే లక్ష్యంగా పనిచేస్తానని నూతన అధ్యక్షుడు ఎటెల్లి పరమేశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి