Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:56 PM

శని త్రయోదశి పర్వదినాన పిల్లలమరి శివాలయంలో శని భగవానునికి విశేష పూజలు

శని త్రయోదశి పర్వదినాన పిల్లలమరి శివాలయంలో శని భగవానునికి విశేష పూజలు

శని త్రయోదశి పర్వదినాన పిల్లలమరి శివాలయంలో శని భగవానునికి విశేష పూజలు
January 31, 2026 10:06 AM 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పిల్లలమర్రి

ఈరోజు శని త్రయోదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మకమైన పిల్లలమర్రి శివాలయంలోని నవగ్రహ మండపంలో వేంచేసియున్న సతీ సమేత శని భగవానునికి తెల్లవారుజామున భక్తుల సాహస్తాలతో విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శని భగవానునికి తైలాభిషేకం, పుష్పార్చన, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి దివ్య దర్శనం కల్పించారు.శని త్రయోదశి సందర్భంగా నిర్వహించిన ఈ పూజలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. శని భగవానుని దర్శించుకోవడం వల్ల కష్టాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News