Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:57 PM

శనగలగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా

శనగలగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా

శనగలగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా
February 24, 2026 06:00 PM 285 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో ఉన్న శనగల గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడనుంది. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర పాల్గుణ శుద్ధ అష్టమి సందర్భంగా నిర్వహించబడుతున్న ఈ మహోత్సవంలో భాగంగా మంగళవారం (24-02-2026) ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యవాచనం, అఖండ దీపారాధన, గణపతి హోమం కార్యక్రమాలు జరుగనున్నాయి.

బుధవారం (25-02-2026) ఉదయం 8 గంటలకు గరుడముద్ద, 10 గంటలకు ఎదురుకోలు కార్యక్రమం నిర్వహించబడనుంది.ఉదయం 11:15 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగనుండగా, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రం 5:30 గంటలకు పలహారపు బండ్ల ప్రదర్శన, రాత్రి 9 గంటల నుండి యక్షగాన కళాకారులచే వీధి భాగవత ప్రదర్శన భక్తులను అలరించనుంది.

గురువారం (26-02-2026) ఉదయం 4 గంటలకు కుంభహోమం, రథోత్సవం, చక్రతీర్థం కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

ఈ మహోత్సవానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులు కళ్యాణ కర్తలుగా వ్యవహరిస్తుండగా, దేవాలయ కమిటీ చైర్మన్ చింతల సుగుణమ్మ దేవరాజ్ దంపతులు, అన్నప్రసాద పోషకులు చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ నవనీత–దేవేందర్ దంపతులు సహకారం అందిస్తున్నారు.ముఖ్య అతిథులుగా రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, తీన్మార్ మల్లన్న, ఎం.సి. కోటి రెడ్డి హాజరుకానున్నారు.స్వామివారి కళ్యాణం రోజు పంతంగి గ్రామం నుండి శనగల గుట్ట వరకు ఉచిత ఆటో సౌకర్యం కల్పించనున్నట్లు దేవస్థానం కమిటీ తెలిపింది. మహోత్సవానికి సహకరించిన దాతల పేర్లు దేవాలయ ఆవరణంలో ఫ్లెక్సీలపై ప్రదర్శించబడనున్నాయి.అలాగే ప్రతి నెల మాస కళ్యాణం, ప్రతి శనివారం శనిశిల పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నట్లు దేవస్థానం నిర్వాహకులు వెల్లడించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం కమిటీ కోరింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News