Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:20 PM

శ్మశానవాటికకు ఊపిరి… ఎంపీ నిధులతో రు.20 లక్షలు మంజూరు

శ్మశానవాటికకు ఊపిరి… ఎంపీ నిధులతో రు.20 లక్షలు మంజూరు

శ్మశానవాటికకు ఊపిరి… ఎంపీ నిధులతో రు.20 లక్షలు మంజూరు
February 23, 2026 05:32 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రజల విన్నపానికి వెంటనే స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్

జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా:

ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న చక్రదేవరపల్లి గ్రామ శ్మశానవాటికకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. గ్రామ ప్రజల వినతిని పరిగణనలోకి తీసుకున్న తన ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల నుంచి రూ.20 లక్షలను విడుదల చేసినట్లు స్థానిక నాయకులు తెలిపారు.

చింతలపూడి నియోజకవర్గం పరిధిలోని ఈ గ్రామంలో శ్మశానవాటిక సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఇటీవల ఎంపీ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ వెంటనే నిధుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

ఎమ్మెల్యే సహకారం అభినందనీయం

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ, ఎంపీటీసీ సాయిల రాంబాబు మాట్లాడుతూ గ్రామ అవసరాన్ని గుర్తించి తక్షణమే స్పందించిన ఎంపీకి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే సహకారం కూడా అభినందనీయమని పేర్కొన్నారు.

శ్మశానవాటిక అభివృద్ధితో కాంపౌండ్ వాల్, షెడ్, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఈ పనులు పూర్తయితే గ్రామ ప్రజలకు గౌరవప్రదమైన అంత్యక్రియల నిర్వహణకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు వైట్ల ఆంజనేయులు, పడవల ప్రసాద్, మన్నే రమేష్, ఉమ్మడి శ్రీను, కంపసాటి దుర్గారావు, నరదల బసవరాజు, మానికల వీరాస్వామి, మానికల పేర్రాజు, సత్తెనపల్లి నాగరాజు, యలమంచిలి మహేష్, కరిపోతు గాబ్రియేలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరడంతో చక్రదేవరపల్లిలో సంతృప్తి వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News