Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:56 AM

శిలాఫలకాలు ధ్వంసం.. నకిరేకల్‌లో కాంగ్రెస్ అరాచక పాలన: చిరుమర్తి లింగయ్య

శిలాఫలకాలు ధ్వంసం.. నకిరేకల్‌లో కాంగ్రెస్ అరాచక పాలన: చిరుమర్తి లింగయ్య

శిలాఫలకాలు ధ్వంసం.. నకిరేకల్‌లో కాంగ్రెస్ అరాచక పాలన: చిరుమర్తి లింగయ్య
January 03, 2026 03:16 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శిలాఫలకాలు ధ్వంసం చేసినంత మాత్రాన అభివృద్ధిని చెరపలేరు:

నకిరేకల్ నియోజకవర్గం

నకిరేకల్ మండలంలోని మోదినిగూడెం గ్రామంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన ఘటనపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ధ్వంసమైన శిలాఫలకాలను పరిశీలించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని, కేసీఆర్ హయాంలో మంజూరైన పనులకే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి కాలయాపన చేస్తోందని ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గంలో తాము తీసుకొచ్చిన అభివృద్ధి పనులకే స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేస్తున్నారని పేర్కొన్నారు.

తాము ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. శిలాఫలకాలు పగలగొట్టినంత మాత్రాన బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చెరపలేరని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో గంజాయి బ్యాచ్‌ను అడ్డం పెట్టుకుని చిల్లర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు.

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు.

రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తూ, నకిరేకల్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై పూర్తి నివేదిక తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News