శిలాఫలకాలు ధ్వంసం.. నకిరేకల్లో కాంగ్రెస్ అరాచక పాలన: చిరుమర్తి లింగయ్య
శిలాఫలకాలు ధ్వంసం.. నకిరేకల్లో కాంగ్రెస్ అరాచక పాలన: చిరుమర్తి లింగయ్య
Editor Desk
శిలాఫలకాలు ధ్వంసం చేసినంత మాత్రాన అభివృద్ధిని చెరపలేరు:
నకిరేకల్ నియోజకవర్గం
నకిరేకల్ మండలంలోని మోదినిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన ఘటనపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ధ్వంసమైన శిలాఫలకాలను పరిశీలించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని, కేసీఆర్ హయాంలో మంజూరైన పనులకే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి కాలయాపన చేస్తోందని ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గంలో తాము తీసుకొచ్చిన అభివృద్ధి పనులకే స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
తాము ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. శిలాఫలకాలు పగలగొట్టినంత మాత్రాన బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చెరపలేరని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో గంజాయి బ్యాచ్ను అడ్డం పెట్టుకుని చిల్లర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు.
రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తూ, నకిరేకల్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై పూర్తి నివేదిక తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. .
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి