స్థానికం: భువనగిరి ప్రతినిధి నల్లమసు కుమార్
జాగృతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1,2,3 ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నాగిరెడ్డిపల్లి,ఏంబావి,ఎర్రంబెల్లి గ్రామాలలో నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరం నాలుగో రోజుకు చేరుకున్నాయి.ఈ శిబిరాలను కళాశాల ప్రిన్సిపల్ ఎస్.మల్లేశం సందర్శించడం జరిగింది.నాలుగు రోజులు భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత,వాతావరణ మార్పు వలన వచ్చి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జెక్క రాఘవేందర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు వెంకటేష్,ఇస్తారి సుధా కిషోర్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి