Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి
17-12-2025 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

స్థానికం ప్రతినిధి

హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో వచ్చిన రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది.

విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్ మను చౌదరి శాలువాలు, పుష్పగుచ్ఛాలతో రాష్ట్రపతిని ఆత్మీయంగా సత్కరించారు.

ప్రత్యేక విమానం నుంచి దిగిన వెంటనే అధికారిక గౌరవాలతో స్వాగతం అందుకున్న రాష్ట్రపతి, అనంతరం ప్రత్యేక వాహనంలో రాష్ట్రపతి నిలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ముందుగా విమానాశ్రయానికి విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావులకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రాకతో హకీంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో కళకళలాడాయి.

Sthanikam

శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

Article Image

శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

స్థానికం ప్రతినిధి

హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో వచ్చిన రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది.

విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్ మను చౌదరి శాలువాలు, పుష్పగుచ్ఛాలతో రాష్ట్రపతిని ఆత్మీయంగా సత్కరించారు.

ప్రత్యేక విమానం నుంచి దిగిన వెంటనే అధికారిక గౌరవాలతో స్వాగతం అందుకున్న రాష్ట్రపతి, అనంతరం ప్రత్యేక వాహనంలో రాష్ట్రపతి నిలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ముందుగా విమానాశ్రయానికి విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావులకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రాకతో హకీంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో కళకళలాడాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News