Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:43 PM

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు
December 31, 2025 09:10 AM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

రామన్నపేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట: నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేళ శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రజలు సంయమనం పాటించాలని స్థానిక సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. వేడుకలు ఆనందంగా సాగాలి గానీ, అవి ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు.

డిసెంబర్ 31 రాత్రి నుంచి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుందని, మండల వ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, శబ్ద కాలుష్యం సృష్టించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.

ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తేనే నిజమైన ఆనందం దక్కుతుందని పేర్కొన్నారు. చట్ట నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని సీఐ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News