శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు
Editor Desk
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి.
రామన్నపేట స్థానిక ప్రతినిధి
రామన్నపేట: నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేళ శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రజలు సంయమనం పాటించాలని స్థానిక సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. వేడుకలు ఆనందంగా సాగాలి గానీ, అవి ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు.
డిసెంబర్ 31 రాత్రి నుంచి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుందని, మండల వ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, శబ్ద కాలుష్యం సృష్టించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.
ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తేనే నిజమైన ఆనందం దక్కుతుందని పేర్కొన్నారు. చట్ట నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని సీఐ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి