Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:32 AM

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు
31-12-2025 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

రామన్నపేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట: నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేళ శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రజలు సంయమనం పాటించాలని స్థానిక సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. వేడుకలు ఆనందంగా సాగాలి గానీ, అవి ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు.

డిసెంబర్ 31 రాత్రి నుంచి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుందని, మండల వ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, శబ్ద కాలుష్యం సృష్టించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.

ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తేనే నిజమైన ఆనందం దక్కుతుందని పేర్కొన్నారు. చట్ట నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని సీఐ స్పష్టం చేశారు.

Sthanikam

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు

Article Image

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

రామన్నపేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట: నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేళ శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రజలు సంయమనం పాటించాలని స్థానిక సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. వేడుకలు ఆనందంగా సాగాలి గానీ, అవి ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు.

డిసెంబర్ 31 రాత్రి నుంచి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుందని, మండల వ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, శబ్ద కాలుష్యం సృష్టించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.

ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తేనే నిజమైన ఆనందం దక్కుతుందని పేర్కొన్నారు. చట్ట నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని సీఐ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News