Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:31 AM

సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినోత్సవ వేడుకలు

సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినోత్సవ వేడుకలు

సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినోత్సవ వేడుకలు
20-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ప్రజా ప్రభుత్వం పథకాల అమలులో సేవాదళ్ కీలక పాత్ర

భువనగిరి టౌన్ :రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజు మాట్లాడుతూ,జితేందర్ నాయకత్వంలో సేవాదళ్ రాష్ట్రవ్యాప్తంగా బలోపేతమై ఎన్నికల్లో విశేష ఫలితాలు సాధించిందన్నారు.2023లో సేవాదళ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వాలంటీర్లను నియమించి ఎమ్మెల్యేల గెలుపుకోసం కృషి చేశారని తెలిపారు. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌చార్జీలను నియమించి ఎంపీల విజయానికి సేవాదళ్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా శ్రమించారని,ఫలితంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సన్నబియ్యం పంపిణీ, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకెళ్తోందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని అందించడంలో నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్,జనరల్ సెక్రటరీ షేక్ వాజిద్,బ్లాక్ సేవాదళ్ అధ్యక్షులు లోక్ దాస్ ఉప్పలయ్య,యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ పుట్ట శివకుమార్,బత్తిని జితేందర్,ప్రకాష్, శ్రీనివాస్,జల్తా రాజు,రాజు గౌడ్,సురేందర్,రాజశేఖర్,అంకం రాజేష్,మహిళా జిల్లా నాయకురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినోత్సవ వేడుకలు

Article Image

-ప్రజా ప్రభుత్వం పథకాల అమలులో సేవాదళ్ కీలక పాత్ర

భువనగిరి టౌన్ :రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజు మాట్లాడుతూ,జితేందర్ నాయకత్వంలో సేవాదళ్ రాష్ట్రవ్యాప్తంగా బలోపేతమై ఎన్నికల్లో విశేష ఫలితాలు సాధించిందన్నారు.2023లో సేవాదళ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వాలంటీర్లను నియమించి ఎమ్మెల్యేల గెలుపుకోసం కృషి చేశారని తెలిపారు. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌చార్జీలను నియమించి ఎంపీల విజయానికి సేవాదళ్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా శ్రమించారని,ఫలితంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సన్నబియ్యం పంపిణీ, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకెళ్తోందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని అందించడంలో నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్,జనరల్ సెక్రటరీ షేక్ వాజిద్,బ్లాక్ సేవాదళ్ అధ్యక్షులు లోక్ దాస్ ఉప్పలయ్య,యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ పుట్ట శివకుమార్,బత్తిని జితేందర్,ప్రకాష్, శ్రీనివాస్,జల్తా రాజు,రాజు గౌడ్,సురేందర్,రాజశేఖర్,అంకం రాజేష్,మహిళా జిల్లా నాయకురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News