Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:02 AM

సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినోత్సవ వేడుకలు

సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినోత్సవ వేడుకలు

సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినోత్సవ వేడుకలు
February 20, 2026 08:18 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ప్రజా ప్రభుత్వం పథకాల అమలులో సేవాదళ్ కీలక పాత్ర

భువనగిరి టౌన్ :రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజు మాట్లాడుతూ,జితేందర్ నాయకత్వంలో సేవాదళ్ రాష్ట్రవ్యాప్తంగా బలోపేతమై ఎన్నికల్లో విశేష ఫలితాలు సాధించిందన్నారు.2023లో సేవాదళ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వాలంటీర్లను నియమించి ఎమ్మెల్యేల గెలుపుకోసం కృషి చేశారని తెలిపారు. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌చార్జీలను నియమించి ఎంపీల విజయానికి సేవాదళ్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా శ్రమించారని,ఫలితంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సన్నబియ్యం పంపిణీ, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకెళ్తోందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని అందించడంలో నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్,జనరల్ సెక్రటరీ షేక్ వాజిద్,బ్లాక్ సేవాదళ్ అధ్యక్షులు లోక్ దాస్ ఉప్పలయ్య,యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ పుట్ట శివకుమార్,బత్తిని జితేందర్,ప్రకాష్, శ్రీనివాస్,జల్తా రాజు,రాజు గౌడ్,సురేందర్,రాజశేఖర్,అంకం రాజేష్,మహిళా జిల్లా నాయకురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News