సేవాభావంతో ముందుకు వచ్చిన ఆచార్య – పాఠశాలకు విరాళం
సేవాభావంతో ముందుకు వచ్చిన ఆచార్య – పాఠశాలకు విరాళం
Krishna
శ్రీ సరస్వతీ విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న చంద్రశేఖర్ ఆచార్య మాట్లాడుతూ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించడంలో విద్యకు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్థాపించబడిందని వివరించారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, మంచి విలువలు, ఆచారాలు, భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించే సాధనమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆచార్య పాఠశాల అభివృద్ధి కోసం 11,000 రూపాయలను సేవా నిధిగా అందజేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అర్థం చంద్రశేఖర్, సహ కార్యదర్శి శివరాజ్, గోవర్ధన్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి, పూర్వ విద్యార్థులు, ఆచార్యులు, మాతాజీలు మరియు విద్యార్థి బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ ఆవిర్భావ దినోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి