సేవా కార్యక్రమాలతో సదాశివపేటలో సామ్ ట్రస్ట్ ప్రత్యేక గుర్తింపు: ఎమ్మెల్యే
సేవా కార్యక్రమాలతో సదాశివపేటలో సామ్ ట్రస్ట్ ప్రత్యేక గుర్తింపు: ఎమ్మెల్యే
Krishna
సదాశివపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సామ్ ట్రస్ట్ చారిటీ అండ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జాతీయ అవార్డు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. సామ్ ట్రస్ట్ చైర్మన్ షేక్ అంజుమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెహందీ డిజైన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయడంతో పాటు టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు మరియు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి నగదు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ సామ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. విద్య, మహిళా సాధికారత మరియు సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి ట్రస్ట్ చేస్తున్న కృషి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షులు అక్బర్ హుస్సేన్, కౌన్సిలర్లు సోమశేఖర్, ఫణి కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, టీఆర్ఎస్ నాయకులు నాగుల విజయకుమార్, లతేఫ్, నసీరుద్దీన్, శ్రీహరి, హాజీ, చింత సాయినాథ్, మోబిన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి