పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ముస్లిం సోదర సోదరీమణులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 3000 కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సౌహార్దతను పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూనే, మరోవైపు స్వంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవితమ్మ తన ప్రత్యేక ముద్రను చూపిస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి