Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:53 PM

సేవ్ డ్రైవ్ ...సేవ్ అలైవ్ మీఅప్రమత్తతే మీ కుటుంబానికి రక్షణ..!

సేవ్ డ్రైవ్ ...సేవ్ అలైవ్ మీఅప్రమత్తతే మీ కుటుంబానికి రక్షణ..!

సేవ్ డ్రైవ్ ...సేవ్ అలైవ్  మీఅప్రమత్తతే మీ కుటుంబానికి రక్షణ..!
February 24, 2026 08:58 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించిన పట్టణ సీఐ రమేష్

భువనగిరి టౌన్: నేటి యాంత్రిక జీవనంలో వేగం వినోదాన్ని ఇస్తుండవచ్చు,కానీ అదే వేగం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోందని కాసేపు ఆలస్యమైనా పర్వాలేదు, క్షేమంగా ఇంటికి చేరడం ముఖ్యం" అనే విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని సేవ్ డ్రైవ్ ...సేవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణ క్యాబ్ డ్రైవర్లకు పట్టణ సీఐ ఎం.రమేష్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 70 శాతం మంది యువతే ఉండటం ఆందోళనకరమని అతి వేగం నిర్ణీత వేగ పరిమితిని మించి వాహనం నడపడం,మద్యం సేవించి డ్రైవింగ్ మెదడుపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు నివారించాలని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అదేవిధంగా టూ వీలర్ ఫోర్ వీలర్ వాహనదారులు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించక పోవడం చిన్న ప్రమాదం జరిగినా తలకు దెబ్బ తగలడం వల్ల ప్రాణాపాయం సంభవిస్తోందని గుర్తు చేశారు. పరధ్యానం (సెల్ ఫోన్ వాడకం)డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం లేదా మెసేజ్ చేయడం వల్ల దృష్టి మళ్లుతోందని దీంతో ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ క్రింది నియమాలను పాటిస్తే "డ్రైవ్ సేఫ్ - సేవ్ లైఫ్" అనే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.హెల్మెట్ తప్పనిసరి ద్విచక్ర వాహనదారులు ఐఎస్‌ఐ (ISI) ముద్ర ఉన్న హెల్మెట్లను ధరించాలని వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం శ్రేయస్కరం తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగడం,జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు దారి ఇవ్వడం బాధ్యతగా భావించాలని వాహన కండిషన్ టైర్లు,బ్రేకులు మరియు లైట్లు సక్రమంగా ఉన్నాయో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని బాధ్యతగా గుర్తుంచుకోవాలని అన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు,అది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత గుర్తించాలని కోరారు. మీరు క్షేమంగా ఇంటికి వస్తారని మీ తల్లిదండ్రులు,భార్యాపిల్లలు ఎదురుచూస్తుంటారని గుర్తుంచుకోవాలని మీ ప్రాణం మీ చేతుల్లోనే ఉందని యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదరహిత జిల్లాగా మార్చాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ లక్ష్మయ్య,పోలీస్ సిబ్బంది,క్యాబ్ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు తాజ్ భాయ్,భాస్కర్,నర్సిరెడ్డి,నారాయణ,పల్లెపాటి వెంకటేష్,యాదగిరి,రవి,ముఖేష్,జానకిరామ్,సోమయ్య సురేష్, శ్రీనివాస్,బబ్లు,రాము తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News