బోయగుబ్బ: ఆ భగవంతుని ఆశీస్సులతో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ కానుకగా పుస్తె మెట్టెలను సమర్పిస్తూ శ్రీమతి శ్రీ రేగులగడ్డ పార్వతమ్మ స్వామి గౌడ్ గారు తమ భక్తిని చాటుకున్నారు.
కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మగొని లింగుస్వామి, మూడో వార్డు సభ్యుడు గుత్తా శ్రీనివాస్ రెడ్డి, నాలుగో వార్డు సభ్యుడు మల్యాల నరేందర్ పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. పూజా కార్యక్రమాలు భక్తి వాతావరణంలో సాగాయి.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి