Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.సర్పంచ్ కంచి మధుసూదన్ TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 05:32 PM

సీతారాముల కల్యాణానికి శుభారంభం

సీతారాముల కల్యాణానికి శుభారంభం

సీతారాముల కల్యాణానికి శుభారంభం
March 26, 2026 03:48 PM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గురువారం ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కలశస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ వంటి పూజా కార్యక్రమాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు సుధాకర్ శర్మ, పెద్ది కిషోర్ శర్మ లు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు జరిపారు.ఉత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. దేవాలయ కమిటీ అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి, సంధ్య దంపతులు, పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, ధర్మకర్తలు కామిశెట్టి చంద్రశేఖర్, శ్రీదేవి దంపతులు, గుర్రం వెంకటేశం, వెన్నెల రవి గౌడ్ దంపతులు, తూర్పాటి నరసింహ, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, అనిత దంపతులు, బొంగు జంగయ్య గౌడ్, కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసు గౌడ్, సుర్వి నర్సింహా గౌడ్, చిక్క నరసింహ, ముత్యాల భూపాల్ రెడ్డి, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, కాసుల వెంకటేష్ గౌడ్, కంచరకుంట్ల వెంకటరెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, బొడిగె బాలకృష్ణ గౌడ్, బొబ్బిళ్ళ శ్రీరాములు, ఉడుగు మల్లేష్ గౌడ్, డాకోజి లక్ష్మీనారాయణ, గుజ్జుల రవీందర్ రెడ్డి, భువనగిరి శ్రీనివాస్, వరగంటి బోవయ్య గౌడ్, మహిళా భక్తులు కొసనం అనురాధ, రాజపేట శ్రీలత, అనూష, మామిడి వెంకటమ్మ, దాడి పద్మ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ తెలిపింది. సుమారు పదివేల మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షుడు బొబ్బిళ్ళ మురళి మాట్లాడుతూ,

“భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని విజయవంతం చేయాలి” అని కోరారు. చౌటుప్పల్ పురపాలక, మండల ప్రజలు ఈ మహోత్సవాన్ని కన్నుల విందుగా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News