Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:52 PM

సీతారాముల కల్యాణానికి శుభారంభం

సీతారాముల కల్యాణానికి శుభారంభం

సీతారాముల కల్యాణానికి శుభారంభం
March 26, 2026 03:48 PM 220 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గురువారం ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కలశస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ వంటి పూజా కార్యక్రమాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు సుధాకర్ శర్మ, పెద్ది కిషోర్ శర్మ లు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు జరిపారు.ఉత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. దేవాలయ కమిటీ అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి, సంధ్య దంపతులు, పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, ధర్మకర్తలు కామిశెట్టి చంద్రశేఖర్, శ్రీదేవి దంపతులు, గుర్రం వెంకటేశం, వెన్నెల రవి గౌడ్ దంపతులు, తూర్పాటి నరసింహ, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, అనిత దంపతులు, బొంగు జంగయ్య గౌడ్, కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసు గౌడ్, సుర్వి నర్సింహా గౌడ్, చిక్క నరసింహ, ముత్యాల భూపాల్ రెడ్డి, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, కాసుల వెంకటేష్ గౌడ్, కంచరకుంట్ల వెంకటరెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, బొడిగె బాలకృష్ణ గౌడ్, బొబ్బిళ్ళ శ్రీరాములు, ఉడుగు మల్లేష్ గౌడ్, డాకోజి లక్ష్మీనారాయణ, గుజ్జుల రవీందర్ రెడ్డి, భువనగిరి శ్రీనివాస్, వరగంటి బోవయ్య గౌడ్, మహిళా భక్తులు కొసనం అనురాధ, రాజపేట శ్రీలత, అనూష, మామిడి వెంకటమ్మ, దాడి పద్మ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ తెలిపింది. సుమారు పదివేల మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షుడు బొబ్బిళ్ళ మురళి మాట్లాడుతూ,

“భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని విజయవంతం చేయాలి” అని కోరారు. చౌటుప్పల్ పురపాలక, మండల ప్రజలు ఈ మహోత్సవాన్ని కన్నుల విందుగా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News