సీసీ రోడ్ల పనులకు శ్రీకారం – గ్రామ అభివృద్ధికి నాణ్యతతో పనులు చేయాలి..
సీసీ రోడ్ల పనులకు శ్రీకారం – గ్రామ అభివృద్ధికి నాణ్యతతో పనులు చేయాలి..
Krishna
సిర్గాపూర్ మండలంలోని వాసర్ మరియు చందర్తాండ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్లు హన్మంత్ రావు పాటిల్, రుక్మిణి పూల్ సింగ్ ఆహ్వానం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు,తండాల అభివృద్ధికి మౌలిక వసతులు ముఖ్యమని, ముఖ్యంగా రహదారులు ప్రజల రోజువారీ జీవితానికి ఎంతో అవసరమని తెలిపారు.చేపట్టిన సీసీ రోడ్ల పనులు నాణ్యతతో, సమయానికి పూర్తిచేయాలని, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్లు హన్మంత్ రావు, రుక్మిణి పూల్ సింగ్, ఉప సర్పంచ్ విఠల్ రెడ్డి, అంతు పటేల్, విట్టల్ రావు పాటిల్,మాజీ సర్పంచ్లు,కౌన్సిలర్లు బాణపురం రాజు,రాంసింగ్, శంకర్, కౌన్సిలర్లు మహేష్ చౌహన్, వెంకట్ నాయక్, విఠల్,మారుతీ,పుడ్లిక్,ప్రకాష్ పటేల్, వెంకట్ రెడ్డి, జగదీష్, జైవంత్, ఎసప్ప, మాణిక్, దివాకర్ రెడ్డి, బాబు తదితరులు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ, తండా నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి