Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:25 AM

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు
April 03, 2026 06:38 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం పరిధిలో జంమ్గి (కే) హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్ పక్కన ఉన్న ఒక ఇంటి లో నిన్న జరిగిన దొంగతనం కేసులో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు.ఈ కేసులో నిందితురాలు వాడిత్య సౌందర్య (21 సంవత్సరాలు), ఎం.సి నాయక్ కుమార్తె, కంగ్టి మండలం జామగట్టి బి తండాకు చెందినదిగా గుర్తించారు. వివాహం అయినప్పటికీ భర్తతో వేరుగా ఉంటూ జులాయి జీవితం గడుపుతూ తిరుగుతుందని, గతంలో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత గోవాకు వెళ్లాలనే ఆలోచనతో డబ్బుల కోసం మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయించుకుని, 01-04-2026 న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో యంపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న యాసం సంతోష్ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో ఉన్న బంగారం మరియు నగదును దొంగిలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఈ రోజు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుండి సుమారు 8 తులాలు 5 గ్రాముల బంగారం, రూ.1,10,000 నగదు, ఒక మొబైల్ ఫోన్ మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించగా, ప్రజలు తమ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News