సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు
సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం పరిధిలో జంమ్గి (కే) హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్ పక్కన ఉన్న ఒక ఇంటి లో నిన్న జరిగిన దొంగతనం కేసులో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు.ఈ కేసులో నిందితురాలు వాడిత్య సౌందర్య (21 సంవత్సరాలు), ఎం.సి నాయక్ కుమార్తె, కంగ్టి మండలం జామగట్టి బి తండాకు చెందినదిగా గుర్తించారు. వివాహం అయినప్పటికీ భర్తతో వేరుగా ఉంటూ జులాయి జీవితం గడుపుతూ తిరుగుతుందని, గతంలో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత గోవాకు వెళ్లాలనే ఆలోచనతో డబ్బుల కోసం మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయించుకుని, 01-04-2026 న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో యంపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న యాసం సంతోష్ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో ఉన్న బంగారం మరియు నగదును దొంగిలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఈ రోజు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుండి సుమారు 8 తులాలు 5 గ్రాముల బంగారం, రూ.1,10,000 నగదు, ఒక మొబైల్ ఫోన్ మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించగా, ప్రజలు తమ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి