Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:57 PM

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు
April 03, 2026 06:38 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం పరిధిలో జంమ్గి (కే) హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్ పక్కన ఉన్న ఒక ఇంటి లో నిన్న జరిగిన దొంగతనం కేసులో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు.ఈ కేసులో నిందితురాలు వాడిత్య సౌందర్య (21 సంవత్సరాలు), ఎం.సి నాయక్ కుమార్తె, కంగ్టి మండలం జామగట్టి బి తండాకు చెందినదిగా గుర్తించారు. వివాహం అయినప్పటికీ భర్తతో వేరుగా ఉంటూ జులాయి జీవితం గడుపుతూ తిరుగుతుందని, గతంలో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత గోవాకు వెళ్లాలనే ఆలోచనతో డబ్బుల కోసం మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయించుకుని, 01-04-2026 న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో యంపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న యాసం సంతోష్ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో ఉన్న బంగారం మరియు నగదును దొంగిలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఈ రోజు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుండి సుమారు 8 తులాలు 5 గ్రాముల బంగారం, రూ.1,10,000 నగదు, ఒక మొబైల్ ఫోన్ మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించగా, ప్రజలు తమ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News