Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:26 AM

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు
03-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం పరిధిలో జంమ్గి (కే) హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్ పక్కన ఉన్న ఒక ఇంటి లో నిన్న జరిగిన దొంగతనం కేసులో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు.ఈ కేసులో నిందితురాలు వాడిత్య సౌందర్య (21 సంవత్సరాలు), ఎం.సి నాయక్ కుమార్తె, కంగ్టి మండలం జామగట్టి బి తండాకు చెందినదిగా గుర్తించారు. వివాహం అయినప్పటికీ భర్తతో వేరుగా ఉంటూ జులాయి జీవితం గడుపుతూ తిరుగుతుందని, గతంలో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత గోవాకు వెళ్లాలనే ఆలోచనతో డబ్బుల కోసం మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయించుకుని, 01-04-2026 న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో యంపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న యాసం సంతోష్ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో ఉన్న బంగారం మరియు నగదును దొంగిలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఈ రోజు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుండి సుమారు 8 తులాలు 5 గ్రాముల బంగారం, రూ.1,10,000 నగదు, ఒక మొబైల్ ఫోన్ మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించగా, ప్రజలు తమ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Sthanikam

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం పరిధిలో జంమ్గి (కే) హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్ పక్కన ఉన్న ఒక ఇంటి లో నిన్న జరిగిన దొంగతనం కేసులో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు.ఈ కేసులో నిందితురాలు వాడిత్య సౌందర్య (21 సంవత్సరాలు), ఎం.సి నాయక్ కుమార్తె, కంగ్టి మండలం జామగట్టి బి తండాకు చెందినదిగా గుర్తించారు. వివాహం అయినప్పటికీ భర్తతో వేరుగా ఉంటూ జులాయి జీవితం గడుపుతూ తిరుగుతుందని, గతంలో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత గోవాకు వెళ్లాలనే ఆలోచనతో డబ్బుల కోసం మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయించుకుని, 01-04-2026 న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో యంపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న యాసం సంతోష్ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో ఉన్న బంగారం మరియు నగదును దొంగిలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఈ రోజు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుండి సుమారు 8 తులాలు 5 గ్రాముల బంగారం, రూ.1,10,000 నగదు, ఒక మొబైల్ ఫోన్ మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించగా, ప్రజలు తమ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News