Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:43 PM

సంచలనం… తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

సంచలనం… తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

సంచలనం… తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు
February 22, 2026 06:50 PM 208 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రధాన పార్టీలకు సవాల్‌గా ‘తెలంగాణ రాజకీయ కూటమి’ ఆవిర్భావం

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్యే రాజకీయ పోరు కొనసాగుతుండగా, ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ వేదిక రంగప్రవేశం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “తెలంగాణ రాజకీయ కూటమి” పేరుతో ఏర్పడిన ఈ కొత్త వేదిక ప్రధాన పార్టీలకు సవాల్ విసరనుంది. హైదరాబాద్ నగరంలోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విస్తృత స్థాయి చర్చా వేదిక సమావేశంలో ఈ కూటమి ఆవిర్భావాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు సరైన ప్రతిబింబం కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఎంతో కాలంగా ఉందని, ప్రజా సమస్యలపై కేంద్రీకృత రాజకీయ వేదిక అవసరమని వివరించారు.

తెలంగాణ విఠల్ మాట్లాడుతూ ప్రధాన పార్టీల మధ్య పరస్పర విమర్శలు జరుగుతున్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంపై స్పష్టత కనిపించడం లేదన్నారు. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ధరల పెరుగుదల, సామాజిక న్యాయం వంటి అంశాలపై కూటమి ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. ప్రొఫెసర్ గాలి వినోద్ రాష్ట్ర రాజకీయాల్లో మూడో శక్తి అవతరించడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా విధానాలు రూపొందించే వేదికగా ఈ కూటమి నిలుస్తుందని చెప్పారు. కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత చర్చలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి వ్యూహరచన ప్రారంభించింది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు, చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. వివిధ సంఘాలు, సామాజిక సంస్థలు, యువజన, రైతు, కార్మిక వర్గాల మద్దతు కూడగట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు నాయకులు తెలిపారు. కొత్త కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రధాన పార్టీలకు ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News