సెలవుల వేళ పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం
సెలవుల వేళ పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం
Krishna
న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్సై దోమ సుజిత్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ… ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండగా, ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి, పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో పిల్లలు ఎక్కువగా ఇంటి వద్దనే ఉంటారని తెలిపారు.ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మొబైల్ ఫోన్ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు స్పందించవద్దని, ఓటీపీలు వంటి వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని హెచ్చరించారు. సైబర్ నేరస్తుల నుంచి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అలాగే సెలవుల కారణంగా పిల్లలకు ద్విచక్ర వాహనాలు లేదా కార్లు ఇవ్వకూడదని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇది కుటుంబాలకు తీవ్ర బాధ కలిగిస్తుందని చెప్పారు. ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని కోరారు.పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయడం అత్యంత అవసరమని, వారి భవిష్యత్తు దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కావున పోలీసుల సూచనలు పాటిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలని హద్నూర్ పోలీసులు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి