Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:52 PM

సెలవుల వేళ పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం

సెలవుల వేళ పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం

సెలవుల వేళ పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం
March 24, 2026 02:18 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్సై దోమ సుజిత్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ… ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండగా, ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి, పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో పిల్లలు ఎక్కువగా ఇంటి వద్దనే ఉంటారని తెలిపారు.ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మొబైల్ ఫోన్ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు స్పందించవద్దని, ఓటీపీలు వంటి వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని హెచ్చరించారు. సైబర్ నేరస్తుల నుంచి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అలాగే సెలవుల కారణంగా పిల్లలకు ద్విచక్ర వాహనాలు లేదా కార్లు ఇవ్వకూడదని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇది కుటుంబాలకు తీవ్ర బాధ కలిగిస్తుందని చెప్పారు. ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని కోరారు.పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయడం అత్యంత అవసరమని, వారి భవిష్యత్తు దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కావున పోలీసుల సూచనలు పాటిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలని హద్నూర్ పోలీసులు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News