Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీవాణి విద్యాలయ వార్షికోత్సవం. ఘనంగా విద్యార్థుల ప్రతిభకు వేదికగా వేడుకలు AAP యువ ముఖానికి ‘రాజ్యసభ ఎగ్జిట్’… అంతర్గత వ్యూహాల్లో భారీ మార్పులా? “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 11:05 PM

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు
April 02, 2026 09:32 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్ పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్సై దోమ సుజిత్ మాట్లాడుతూ మండల ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. ప్రస్తుతం సెలవుల కాలం ప్రారంభమవడంతో చాలా మంది కుటుంబాలతో కలిసి విహారయాత్రలు, శుభకార్యాలు తదితర కారణాలతో ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లడం జరుగుతుందని, ఈ పరిస్థితిని ఉపయోగించుకుని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో దొంగలు బంగారం, నగదు పై ఆశపడి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారని హెచ్చరించారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం లేకుండా ఇంట్లో అధిక మొత్తంలో బంగారం, నగదు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, ఇంటిని తాళం వేసి వెళ్లే ముందు పొరుగువారికి లేదా నమ్మకమైన వారికి సమాచారం ఇవ్వడం మంచిదని సూచించారు. “మన ఇంట్లోకి ఎవరూ రారు” అనే నిర్లక్ష్య భావన వద్దని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రజల సహకారం లేకుండా నేర నియంత్రణ సాధ్యం కాదని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ, అందరూ అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News