Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:45 PM

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు
April 02, 2026 09:32 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్ పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్సై దోమ సుజిత్ మాట్లాడుతూ మండల ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. ప్రస్తుతం సెలవుల కాలం ప్రారంభమవడంతో చాలా మంది కుటుంబాలతో కలిసి విహారయాత్రలు, శుభకార్యాలు తదితర కారణాలతో ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లడం జరుగుతుందని, ఈ పరిస్థితిని ఉపయోగించుకుని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో దొంగలు బంగారం, నగదు పై ఆశపడి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారని హెచ్చరించారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం లేకుండా ఇంట్లో అధిక మొత్తంలో బంగారం, నగదు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, ఇంటిని తాళం వేసి వెళ్లే ముందు పొరుగువారికి లేదా నమ్మకమైన వారికి సమాచారం ఇవ్వడం మంచిదని సూచించారు. “మన ఇంట్లోకి ఎవరూ రారు” అనే నిర్లక్ష్య భావన వద్దని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రజల సహకారం లేకుండా నేర నియంత్రణ సాధ్యం కాదని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ, అందరూ అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News