సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు
సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు
Krishna
న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్ పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్సై దోమ సుజిత్ మాట్లాడుతూ మండల ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. ప్రస్తుతం సెలవుల కాలం ప్రారంభమవడంతో చాలా మంది కుటుంబాలతో కలిసి విహారయాత్రలు, శుభకార్యాలు తదితర కారణాలతో ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లడం జరుగుతుందని, ఈ పరిస్థితిని ఉపయోగించుకుని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో దొంగలు బంగారం, నగదు పై ఆశపడి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారని హెచ్చరించారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం లేకుండా ఇంట్లో అధిక మొత్తంలో బంగారం, నగదు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, ఇంటిని తాళం వేసి వెళ్లే ముందు పొరుగువారికి లేదా నమ్మకమైన వారికి సమాచారం ఇవ్వడం మంచిదని సూచించారు. “మన ఇంట్లోకి ఎవరూ రారు” అనే నిర్లక్ష్య భావన వద్దని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రజల సహకారం లేకుండా నేర నియంత్రణ సాధ్యం కాదని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ, అందరూ అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి