Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:05 AM

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు
April 02, 2026 09:32 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్ పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్సై దోమ సుజిత్ మాట్లాడుతూ మండల ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. ప్రస్తుతం సెలవుల కాలం ప్రారంభమవడంతో చాలా మంది కుటుంబాలతో కలిసి విహారయాత్రలు, శుభకార్యాలు తదితర కారణాలతో ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లడం జరుగుతుందని, ఈ పరిస్థితిని ఉపయోగించుకుని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో దొంగలు బంగారం, నగదు పై ఆశపడి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారని హెచ్చరించారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం లేకుండా ఇంట్లో అధిక మొత్తంలో బంగారం, నగదు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, ఇంటిని తాళం వేసి వెళ్లే ముందు పొరుగువారికి లేదా నమ్మకమైన వారికి సమాచారం ఇవ్వడం మంచిదని సూచించారు. “మన ఇంట్లోకి ఎవరూ రారు” అనే నిర్లక్ష్య భావన వద్దని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రజల సహకారం లేకుండా నేర నియంత్రణ సాధ్యం కాదని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ, అందరూ అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News