Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:33 AM

సీసీ కెమెరాల ఏర్పాటు మరియు సౌకర్యాల కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన: జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు

సీసీ కెమెరాల ఏర్పాటు మరియు సౌకర్యాల కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన: జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు

సీసీ కెమెరాల ఏర్పాటు మరియు సౌకర్యాల కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన: జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు
21-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలు సరిగా లేవని, ముఖ్యంగా కొన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడం వల్ల పారదర్శకత లోపిస్తున్నదని పేర్కొంటూ నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి కి వినతిపత్రం అందజేశారు.జీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు,పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్.ఈ సందర్భంగా గుఱ్ఱపు మచ్చేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలందించే కేంద్రాలుగా ఉండాలని, అక్కడ జరిగే ప్రతి ప్రక్రియ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. మండల కార్యాలయాల్లో సమగ్ర సీసీ కెమెరా నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, ప్రజలకు న్యాయం వేగంగా అందుతుందని పేర్కొన్నారు.అలాగే, కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు తాగునీరు, కూర్చునే సదుపాయం, శౌచాలయాలు వంటి మౌలిక వసతులు కూడా మెరుగుపరచాలని సబ్ కలెక్టర్ కు సూచించారు. ప్రజల సమస్యలపై తాము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు.ఈ వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి, సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.

Sthanikam

సీసీ కెమెరాల ఏర్పాటు మరియు సౌకర్యాల కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన: జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలు సరిగా లేవని, ముఖ్యంగా కొన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడం వల్ల పారదర్శకత లోపిస్తున్నదని పేర్కొంటూ నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి కి వినతిపత్రం అందజేశారు.జీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు,పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్.ఈ సందర్భంగా గుఱ్ఱపు మచ్చేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలందించే కేంద్రాలుగా ఉండాలని, అక్కడ జరిగే ప్రతి ప్రక్రియ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. మండల కార్యాలయాల్లో సమగ్ర సీసీ కెమెరా నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, ప్రజలకు న్యాయం వేగంగా అందుతుందని పేర్కొన్నారు.అలాగే, కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు తాగునీరు, కూర్చునే సదుపాయం, శౌచాలయాలు వంటి మౌలిక వసతులు కూడా మెరుగుపరచాలని సబ్ కలెక్టర్ కు సూచించారు. ప్రజల సమస్యలపై తాము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు.ఈ వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి, సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News