సీసీ కెమెరాల ఏర్పాటు మరియు సౌకర్యాల కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన: జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు
సీసీ కెమెరాల ఏర్పాటు మరియు సౌకర్యాల కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన: జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలు సరిగా లేవని, ముఖ్యంగా కొన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడం వల్ల పారదర్శకత లోపిస్తున్నదని పేర్కొంటూ నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి కి వినతిపత్రం అందజేశారు.జీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు,పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్.ఈ సందర్భంగా గుఱ్ఱపు మచ్చేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలందించే కేంద్రాలుగా ఉండాలని, అక్కడ జరిగే ప్రతి ప్రక్రియ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. మండల కార్యాలయాల్లో సమగ్ర సీసీ కెమెరా నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, ప్రజలకు న్యాయం వేగంగా అందుతుందని పేర్కొన్నారు.అలాగే, కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు తాగునీరు, కూర్చునే సదుపాయం, శౌచాలయాలు వంటి మౌలిక వసతులు కూడా మెరుగుపరచాలని సబ్ కలెక్టర్ కు సూచించారు. ప్రజల సమస్యలపై తాము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు.ఈ వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి, సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి