Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

సీసీ కెమెరాల ఏర్పాటు మరియు సౌకర్యాల కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన: జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు

సీసీ కెమెరాల ఏర్పాటు మరియు సౌకర్యాల కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన: జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు

సీసీ కెమెరాల ఏర్పాటు మరియు సౌకర్యాల కోసం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన: జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు
January 21, 2026 07:54 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలు సరిగా లేవని, ముఖ్యంగా కొన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడం వల్ల పారదర్శకత లోపిస్తున్నదని పేర్కొంటూ నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి కి వినతిపత్రం అందజేశారు.జీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు,పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్.ఈ సందర్భంగా గుఱ్ఱపు మచ్చేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలందించే కేంద్రాలుగా ఉండాలని, అక్కడ జరిగే ప్రతి ప్రక్రియ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. మండల కార్యాలయాల్లో సమగ్ర సీసీ కెమెరా నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, ప్రజలకు న్యాయం వేగంగా అందుతుందని పేర్కొన్నారు.అలాగే, కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు తాగునీరు, కూర్చునే సదుపాయం, శౌచాలయాలు వంటి మౌలిక వసతులు కూడా మెరుగుపరచాలని సబ్ కలెక్టర్ కు సూచించారు. ప్రజల సమస్యలపై తాము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు.ఈ వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి, సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News