Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:55 PM

సీఐ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యాలయం ప్రారంభం

సీఐ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యాలయం ప్రారంభం

సీఐ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యాలయం ప్రారంభం
January 26, 2026 08:09 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో సోమవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. అఖిల్,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రభాకర్,న్యాల్కల్ మండల అధ్యక్షులు బి. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సంస్థ కమిటీ సభ్యులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా కమిటీ సభ్యులు నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలు,అన్యాయానికి గురైన ప్రజలకు న్యాయం అందేలా ఇలాంటి సంస్థలు ముందుండి పనిచేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం, సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.అలాగే సంస్థ ద్వారా ప్రజాసేవ కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టి, మానవ హక్కుల పరిరక్షణలో నారాయణఖేడ్ ప్రాంతాన్ని ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News