సీఎం సహాయ నిధితో పేదలకు ఖరీదైన వైద్యం
సీఎం సహాయ నిధితో పేదలకు ఖరీదైన వైద్యం
Biksham
సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు ఖరీదైన వైద్యం అందుతోందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నివాసంలో 24 మంది లబ్ధిదారులకు రూ.9,26,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 నెలల్లో తమ ద్వారా 98 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.40,25,500 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేదల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు వెయ్యి కోట్లకు పైగా నిధులు కేటాయించడం విశేషమన్నారు.పేదలకు ఈ సహాయ నిధి ఒక వరంలా మారిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సహాయం అందిస్తామని తెలిపారు. తమకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పేదల సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి