Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలానికి కొత్త తహసీల్దార్ బాధ్యతలు స్వీకరణ గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 06:25 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ- చౌటుప్పల్‌లో 41 మందికి రూ.16.38 లక్షల అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ- చౌటుప్పల్‌లో 41 మందికి రూ.16.38 లక్షల అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ- చౌటుప్పల్‌లో 41 మందికి రూ.16.38 లక్షల అందజేత
April 06, 2026 04:27 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం క్యాంప్ ఆఫీస్‌లో సోమవారం మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 41 మందికి రూ.16,38,500 విలువైన చెక్కులు అందజేశారు. ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, ఉమామహేశ్వరి సాయిలు, బద్రి గాలయ్య, మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాశం సంజయ్ బాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చింతల సాయిలు, మాజీ ఎంపిటిసి కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, ఓబిసి అధ్యక్షులు ఆవుల యేసు, ఉడుగు రమేష్, కళ్లెం దయాకర్ రెడ్డి, బండమీద వెంకటేష్, రావుల స్వామి, ఊదరి నరసింహ, దొనకొండ కృష్ణ, మదన్ గోపాల్, యూసఫ్, కొండూరు ధర్మేందర్ గౌడ్, పర్నె శివారెడ్డి, వీరమల్ల సత్తయ్య, సుర్కంటి చిన్న వెంకటరెడ్డి, ఊదరి యాదయ్య, మారుపాక ప్రభాకర్ గౌడ్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News