సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ- చౌటుప్పల్లో 41 మందికి రూ.16.38 లక్షల అందజేత
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ- చౌటుప్పల్లో 41 మందికి రూ.16.38 లక్షల అందజేత
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం క్యాంప్ ఆఫీస్లో సోమవారం మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 41 మందికి రూ.16,38,500 విలువైన చెక్కులు అందజేశారు. ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, ఉమామహేశ్వరి సాయిలు, బద్రి గాలయ్య, మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాశం సంజయ్ బాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చింతల సాయిలు, మాజీ ఎంపిటిసి కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, ఓబిసి అధ్యక్షులు ఆవుల యేసు, ఉడుగు రమేష్, కళ్లెం దయాకర్ రెడ్డి, బండమీద వెంకటేష్, రావుల స్వామి, ఊదరి నరసింహ, దొనకొండ కృష్ణ, మదన్ గోపాల్, యూసఫ్, కొండూరు ధర్మేందర్ గౌడ్, పర్నె శివారెడ్డి, వీరమల్ల సత్తయ్య, సుర్కంటి చిన్న వెంకటరెడ్డి, ఊదరి యాదయ్య, మారుపాక ప్రభాకర్ గౌడ్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి