PRINT TIME: May 12, 2026 05:24 PM
సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కోట సుధాకర్
సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కోట సుధాకర్
May 12, 2026 03:46 PM
59 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: పెరిక కులస్తులను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట సుధాకర్ పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరిక కులానికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కార్పొరేషన్ అధ్యక్షుడిగా దొంగరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా బుడిగం శ్రీనివాస్ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక కులస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పెరిక కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించాలని, రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక కోటా కల్పించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి