PRINT TIME: July 03, 2026 10:32 PM
సీఎం పర్యటనని విజయవంతం చేయండి:పల్లె
సీఎం పర్యటనని విజయవంతం చేయండి:పల్లె
May 12, 2026 07:41 PM
94 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మున్సిపల్ మెప్మా గ్రామైక్య సభ్యులు, కూటమి పార్టీల నాయకులతో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటనతో పుట్టపర్తికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించి, భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి