Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:21 PM

సీఐడీ కార్యాలయం ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపు: చిట్యాలలో కీలక నేతల ముందస్తు అరెస్టులు

సీఐడీ కార్యాలయం ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపు: చిట్యాలలో కీలక నేతల ముందస్తు అరెస్టులు

సీఐడీ కార్యాలయం ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపు: చిట్యాలలో కీలక నేతల ముందస్తు అరెస్టులు
April 04, 2026 12:07 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా చిట్యాల పోలీసులు శనివారం ఉదయం పట్టణంలోని కీలక బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్ట్ అయిన వారిలో కూరెళ్ళ లింగస్వామి (చిట్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్), నిమ్మనగోటి శ్రీనివాస్ (10వ వార్డు కౌన్సిలర్), ఆగు అశోక్ యాదవ్ (9వ వార్డు బీఆర్‌ఎస్ ఇంచార్జ్), బొలుగూరి సైదులు, ఆవుల ఆనంద్, దగ్గుల సైదులు, మాసం పల్లి వెంకన్న, నవీన్ రెడ్డి ఉన్నారు.

తమను అక్రమంగా అరెస్ట్ చేయడంపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేయాలని చూస్తోందని వారు విమర్శించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వారు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News