PRINT TIME: May 26, 2026 04:21 PM
సీఐడీ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పిలుపు: చిట్యాలలో కీలక నేతల ముందస్తు అరెస్టులు
సీఐడీ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పిలుపు: చిట్యాలలో కీలక నేతల ముందస్తు అరెస్టులు
April 04, 2026 12:07 PM
37 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా చిట్యాల పోలీసులు శనివారం ఉదయం పట్టణంలోని కీలక బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అరెస్ట్ అయిన వారిలో కూరెళ్ళ లింగస్వామి (చిట్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్), నిమ్మనగోటి శ్రీనివాస్ (10వ వార్డు కౌన్సిలర్), ఆగు అశోక్ యాదవ్ (9వ వార్డు బీఆర్ఎస్ ఇంచార్జ్), బొలుగూరి సైదులు, ఆవుల ఆనంద్, దగ్గుల సైదులు, మాసం పల్లి వెంకన్న, నవీన్ రెడ్డి ఉన్నారు.
తమను అక్రమంగా అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేయాలని చూస్తోందని వారు విమర్శించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వారు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి