Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:47 AM

సీఐడీ కార్యాలయం ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపు: చిట్యాలలో కీలక నేతల ముందస్తు అరెస్టులు

సీఐడీ కార్యాలయం ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపు: చిట్యాలలో కీలక నేతల ముందస్తు అరెస్టులు

సీఐడీ కార్యాలయం ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపు: చిట్యాలలో కీలక నేతల ముందస్తు అరెస్టులు
04-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా చిట్యాల పోలీసులు శనివారం ఉదయం పట్టణంలోని కీలక బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్ట్ అయిన వారిలో కూరెళ్ళ లింగస్వామి (చిట్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్), నిమ్మనగోటి శ్రీనివాస్ (10వ వార్డు కౌన్సిలర్), ఆగు అశోక్ యాదవ్ (9వ వార్డు బీఆర్‌ఎస్ ఇంచార్జ్), బొలుగూరి సైదులు, ఆవుల ఆనంద్, దగ్గుల సైదులు, మాసం పల్లి వెంకన్న, నవీన్ రెడ్డి ఉన్నారు.

తమను అక్రమంగా అరెస్ట్ చేయడంపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేయాలని చూస్తోందని వారు విమర్శించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వారు స్పష్టం చేశారు.

Sthanikam

సీఐడీ కార్యాలయం ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపు: చిట్యాలలో కీలక నేతల ముందస్తు అరెస్టులు

Article Image

హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా చిట్యాల పోలీసులు శనివారం ఉదయం పట్టణంలోని కీలక బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్ట్ అయిన వారిలో కూరెళ్ళ లింగస్వామి (చిట్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్), నిమ్మనగోటి శ్రీనివాస్ (10వ వార్డు కౌన్సిలర్), ఆగు అశోక్ యాదవ్ (9వ వార్డు బీఆర్‌ఎస్ ఇంచార్జ్), బొలుగూరి సైదులు, ఆవుల ఆనంద్, దగ్గుల సైదులు, మాసం పల్లి వెంకన్న, నవీన్ రెడ్డి ఉన్నారు.

తమను అక్రమంగా అరెస్ట్ చేయడంపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేయాలని చూస్తోందని వారు విమర్శించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వారు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News