Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం
10-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి ఆధ్వర్యంలో సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా చౌటుప్పల్ అంబేద్కర్ ట్రస్ట్ చైర్మన్ బోయ రామచందర్ హాజరై మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారని అన్నారు. సమాజంలోని అనగారిన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత ఇలాంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర నాయకులు ఉదరి వెంకటేష్ మహజన్, మండల అధ్యక్షుడు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు చీమకండ్ల శ్రీనివాస్, మండల నాయకులు బర్రె సుధాకర్, చేకూరి బాబు, ఎమ్మార్పీఎస్ పంతంగి గ్రామ శాఖ అధ్యక్షుడు బోయ శ్రావణ్ కుమార్, బోయ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం

Article Image

ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి ఆధ్వర్యంలో సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా చౌటుప్పల్ అంబేద్కర్ ట్రస్ట్ చైర్మన్ బోయ రామచందర్ హాజరై మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారని అన్నారు. సమాజంలోని అనగారిన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత ఇలాంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర నాయకులు ఉదరి వెంకటేష్ మహజన్, మండల అధ్యక్షుడు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు చీమకండ్ల శ్రీనివాస్, మండల నాయకులు బర్రె సుధాకర్, చేకూరి బాబు, ఎమ్మార్పీఎస్ పంతంగి గ్రామ శాఖ అధ్యక్షుడు బోయ శ్రావణ్ కుమార్, బోయ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News