Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:58 PM

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం
March 10, 2026 09:14 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి ఆధ్వర్యంలో సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా చౌటుప్పల్ అంబేద్కర్ ట్రస్ట్ చైర్మన్ బోయ రామచందర్ హాజరై మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారని అన్నారు. సమాజంలోని అనగారిన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత ఇలాంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర నాయకులు ఉదరి వెంకటేష్ మహజన్, మండల అధ్యక్షుడు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు చీమకండ్ల శ్రీనివాస్, మండల నాయకులు బర్రె సుధాకర్, చేకూరి బాబు, ఎమ్మార్పీఎస్ పంతంగి గ్రామ శాఖ అధ్యక్షుడు బోయ శ్రావణ్ కుమార్, బోయ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News