సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం
సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం
K.RAVI
ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి ఆధ్వర్యంలో సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా చౌటుప్పల్ అంబేద్కర్ ట్రస్ట్ చైర్మన్ బోయ రామచందర్ హాజరై మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారని అన్నారు. సమాజంలోని అనగారిన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత ఇలాంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర నాయకులు ఉదరి వెంకటేష్ మహజన్, మండల అధ్యక్షుడు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు చీమకండ్ల శ్రీనివాస్, మండల నాయకులు బర్రె సుధాకర్, చేకూరి బాబు, ఎమ్మార్పీఎస్ పంతంగి గ్రామ శాఖ అధ్యక్షుడు బోయ శ్రావణ్ కుమార్, బోయ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి