PRINT TIME: March 21, 2026 07:50 PM
స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…
స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…
March 21, 2026 06:21 PM
54 Views
స్థానికం ప్రతినిధి :
CHOUTUPPAL MANDAL
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దివిస్ లాబోరేటరీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్ను స్థానిక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంకిరెడ్డిగూడెం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోని మహిళలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ విషయంపై జీఎం సుధాకర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వారికి వివరించారు.అనంతరం సంస్థ తరపున “స్వామి వివేకానంద జీవిత చరిత్ర” పుస్తకాన్ని సుధాకర్కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పాలెం వెంకటేష్, సభ్యులు యాట మహేందర్, నల్ల ఉదయ్ కిరణ్, బడుగు హరినాథ్, భూమిక తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి